దరువేసిన డాలర్ శేషాద్రి.. !

DOLLAR-SHESDRIరాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని తిరుమల తిరుపతిలో ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. సమైక్య రాష్ట్రం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులు ఈరోజు రోడ్డెక్కారు. భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి డాలర్ శేషాద్రి సైతం ర్యాలీ పాల్గొని డప్పు పుచ్చుకొని దరువేశారు. సాధారణంగా ఎప్పుడూ బయటకు రాని శేషాద్రి సమైక్య ఉద్యమంలో పాల్గొని దరువేయడం పలువురిని ఆకర్శించింది. తిరుమలకు విఐపీలు వస్తే, వారిని కలుసుకుని దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయిస్తూ వుంటుండటం తెలిసిందే. కాగా, 48 గంటల పాటు తిరుపతిని దిగ్బంధించే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శుక్రవారం కూడా నగరాన్ని సమైక్య వాదులు ర్యాలీలు, ఆందోళనలు, రాస్తారోకోలతో దిగ్బంధించారు.