Site icon TeluguMirchi.com

నాగం వ్యాఖ్యలను ఖండించిన డీకే అరుణ

dk-aruna-nagamమంత్రి డీకే అరుణ పేదలకు అందాల్సిన నీలి కిరోసిన్ ను అక్రమంగా క్రషర్ కు తరలిస్తున్నారని తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి డీకే అరుణ స్పందిస్తూ.. నాగం జనార్ధన రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ నిరాధారమైనవని ఖండించారు. కిరోసిన్ అక్రమ రవాణాతో తనకు సంబంధం లేదని చెప్పారు. ప్రభుత్వ దర్యాప్తులో వాస్తవాలు తెలుస్తాయని డీకే అరుణ ఈ రోజు స్పష్టం చేసారు.

Exit mobile version