‘నవ తెలంగాణ’లోనే వచ్చే ఎన్నికలు.. !

DK_Arunaరాబోయే సాధారణ ఎన్నికలు ’నవ తెలంగాణ’లో జరుగుతాయని మంత్రి డీకే అరుణ అభిప్రాయపడ్డారు. 2014లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని ఆమె స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సహకారంతో కాంగ్రెస్ నేతలు భారీ బహిరంగ సభకు అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఇదే కోరామని ఆమె చెప్పుకొచ్చారు. కాగా, ఈ సమావేశంలో రెండు తీర్మాణాలు ఆమోదించింది. అందులో ఒకటి హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణపై ప్రకటన చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, రెండోవది రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో త్వరగా బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఈ రెండు తీర్మాణాలను కూడా అధిష్టానానికి అందజేస్తానని మంత్రి అరుణ పేర్కొన్నారు.