Site icon TeluguMirchi.com

శాంతిభద్రతల గురించేనా..?

dgp-dinesh-reddy-shindeకేంద్ర హోం శాఖ మంత్రి దినేష్ రెడ్డితో డిజీపీ దినేష్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణపై తేల్చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో.. డిజీపీ షిండేతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఇప్పటికే స్వీకర్ నాదేండ్ల మనోహర్ తో పాటుగా పలువురు రాష్ట్ర నేతలు అధిష్టాన పెద్దలతో సమావేశమయిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో తెలంగాణ ప్రకటిస్తే.. నక్సల్స్ సమస్య పెరుగుతోందని సీమాంధ్ర నేతలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో.. దీనిపై డిజీపీ దినేష్ రెడ్డి తో షిండే చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్న రాష్ట్రంలో ఎదురయ్యే శాంతిభద్రతల గురించి కేంద్రం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సారి తెలంగాణ అంశాన్ని తేల్చేయాలనే కృతనిశ్చయంతో కేంద్రం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version