నితీష్ పై డిగ్గీ రాజా ఫైర్..!

diggiబుద్ధగయలో ఉగ్రవాద దాడుల విషయంలో.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడుదిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. డిగ్గీ రాజా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మహాబోధి ఆలయంపై తీవ్రవాదులు దాడులు చేసే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ భద్రతా చర్యలు తీసుకోకుండా, వాటి బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని మండిపడ్డారు. అయితే, ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర నివేదిక సమర్పించే వరకూ అందరు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. అనవసరంగా ఈ ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు.