Site icon TeluguMirchi.com

మోడీకి డిగ్గీ రాజా సవాల్

diggiయూపీఏ ప్రభుత్వం పాలన, అభివృద్ధిపై ఏ పార్టీ నాయకుడితోనైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చేతనైతే చర్చకు రావాలని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి సవాలు విసిరారు.కేంద్ర ప్రభుత్వంపై మోడీ తీవ్ర విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. భారత రాజకీయాల్లో అద్భుతాలు చేస్తానని ఆయన చెప్పడం భ్రమేనన్నారు.మోడీ అంతకుముందు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఆర్ఐ మద్దతు దారులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. దేశం ఆర్థికంగా తిరోగమని దిశలో పయనిస్తోందని, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దిగ్విజయ్.. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తప్పుడు లెక్కలతో అభివృద్ధి సాధించినట్టు గొప్పలు చెప్పుకుందని ట్వీట్ చేశారు.

Exit mobile version