Site icon TeluguMirchi.com

గవర్నర్ తో భేటీయైన దిగ్విజయ్ !

digvijay-narasimhanతెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరుకున్న నేపధ్యంలో.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ చక్రం తిప్పుతున్నారు. పార్టీలో ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరుపుతూ అధిష్టానం వ్యూహాలను అమలు చేయడంలో బీజీ అయిపోయిన డిగ్గీరాజా.. ఈరోజు ఉదయం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ, షబ్బీర్ అలీ తో సమావేశమయ్యారు. టీ-బిల్లుపై మద్దతు కూడగట్టే అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచామ్.

Exit mobile version