హైదరాబాద్ చేరుకున్న ఢిగ్గీరాజా!

diggi-reached-hyderabadకాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాదు చేరుకున్నారు. రాష్ట్ర విభజన ఖరారైన తరవాత దిగ్విజయ్ ఏపీకి రావడం ఇది తొలిసారి. శంషాబాద్ విమానాశ్రమంలో ఢిగ్గీరాజాకు తెలంగాణ, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షులు పొన్నాల, రఘువీరా రెడ్డి ఘన స్వాగతం పలికారు. దిగ్విజయ్ ఏపీలో కాలుపెడితే తీవ్ర పరిణామాలుంటాయని సమైక్యాంధ్ర ఆందోళనకారులు హెచ్చరించిన నేపథ్యంలో.. తాజాగా, ఢిగ్గీరాజా ఏపీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.