Site icon TeluguMirchi.com

‘దిగ్విజయ్ గో బ్యాక్’ !

divijay go backసమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయని ఎంపీలను సాంఘీక బహిష్కరణ చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు.  ఏపీఎన్జీవోల హోమ్ లో మీడియాతో అశోక్ బాబు మాట్లాడారు. సొంతపార్టీ సభ్యులే అవిశ్వాసం పెట్టారంటే సమైక్యవాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. విభజన వల్ల కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేకుండా పోతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి టీ బిల్లు వస్తే అన్ని పార్టీలు వ్యతిరేకించాలని అశోక్‌బాబు కోరారు. తెలంగాణ బిల్లును గెలిపించుకునేందుకే దిగ్విజయ్ ఇక్కడకు వస్తున్నారన్న  అశోక్ బాబు.. దిగ్విజయ్ రాక రాష్ట్రానికి అపశకునమన్నారు. దిగ్విజయ్ గో బ్యాక్ అంటూ ఈ నెల 12 నుంచి నిరసనలు చేపడతామన్నారు.

Exit mobile version