నేడు ఢిగ్గీరాజా హైదరాబాద్ రాక !

digvijay singరాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఈరోజు (గురువారం) హైదరాబాద్ రానున్నారు. టీ-బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో ఢిగ్గీరాజా హైదరాబాద్ టూర్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన  నగరంలో రెండు రోజుల పాటు బస చేయనున్నారు. విభజనకు సంబంధించి వారివారి వాదనలు వినిపించడానికి, అన్ని పార్టీల నేతలు దగ్విజయ్ ను కలిసే అవకాశం ఉంది. టీ-బిల్లు ఆసెంబ్లీకి రానున్న నేపథ్యంలో.. సభలో బిల్లు పాస్ చేయించుకునేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పడేందుకు ముందుస్తు వ్యూహాలు రచ్చించించేందుకు వీలుగా దిగ్విజయను ఏపీ కి పంపినట్లు తెలుస్తోంది. మరోపైపు డిగ్గీరాజా గో బ్యాక్ అంటూ ఏపీఎన్జీవోలు ఆందోళనలు చేపట్టనున్నారు.