Site icon TeluguMirchi.com

అభిప్రాయాలుంటే.. అమ్మతో చెప్పండి..!

diggiతెలంగాణపై కేంద్రం దూకుడు పెంచింది. తెలంగాణపై చర్చలు ముగిస్తాయి.. త్వరలోనే తెలంగాణపై నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశం పట్ల సీమాంధ్ర నేతలకు ఏమైనా అభ్యంతరాలు గానీ, అభిప్రాయాలు గానీ వుంటే అధినేత్రి సోనియా గాంధీకి చెప్పొకోండి అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దిగ్గీ రాజా మాటాలను బట్టీ చూస్తే.. కేంద్రం తెలంగాణ ఇవ్వడానికే సిద్దమైనట్లు తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తెలంగాణ అంశంపై ఫైనల్ డిసిషన్ మాత్రం ఈరోజు సాయంత్రం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీలో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిర్ణయం తీసుకున్న అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకోబోయే పరిణామలపై కూడా కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం. ఏదేమైనా.. తెలంగాణ అంశాన్ని తేల్చేయాలనే కేంద్రం ధృడ నిశ్చయంతో ఉన్నట్లు ఢిల్లీ పరిణామాలను చూస్తే అర్థమవుతుందని
రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version