కాంగ్రెస్ కి డిగ్గీ తలనొప్పి

తెలంగాణ పోలీసులు నకిలీ ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్ సృష్టించి ముస్లిం యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యల దూమారం రేపుతున్నాయి. దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు మండిపడుతున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ డిగ్గీరాజా వ్యాఖ్యలను ఖండించారు.

తెలంగాణ పోలీసు విభాగంపై దిగ్విజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వెంటనే దిగ్విజయ్ చేత క్షమాపణలు చెప్పించాలని, లేనిపక్షంలో ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానంగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యాఖ్యల విషయంలో డిగ్గీరాజా పై పోలీసు కేసు కూడా నమోదైయింది.మొత్తంమీద డిగ్గీ వ్యాఖ్యలు కాంగ్రెస్ కి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి.