జగన్ ను తరమికొట్టండి : ధూళిపాళ్ల

dhullipallaవైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. సమైక్య ముసుగులో విభజనకు వైకాపా సహకరిస్తుందని ఆయన ఆరోపించారు. విభజనకు సహాయపడుతున్న జగన్ సీమాంధ్ర ప్రజలు తరమికొట్టాలని ధూళిపాళ్ల పిలుపునిచ్చారు. ఈరోజు(గురవారం) అసెంబ్లీ వాయిదా అనంతరం ధూళిపాళ్ల విలేకరులతో మాట్లాడుతూ.. ఏ పరిస్థితుల్లోనైనా విభజన బిల్లును అడ్డుకోవడానికి తెదేపా సిద్ధంగా వుందని తెలిపారు. అది.. ఓటింగ్ అయినా.. ఇంకేదైనా.. అవకాశం వున్న ప్రతి చోట బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.