Site icon TeluguMirchi.com

కౌంటర్ దాఖలు చేసిన.. కళంకిత మంత్రులు

dhramana sabithaజగన్ అక్రామాస్తుల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి సీబీఐ న్యాయస్థానంలో ఈరోజు (శుక్రవారం) కౌంటర్ దాఖలు చేశారు. జగన్ కంపెనీలైన వాన్ పిక్, దాల్మియా సిమెంట్స్ పెట్టుబడుల వ్యవహారంలో.. ధర్మాన, సబితలను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ గతంలో మెమో దాఖలు చేసిన దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా వీరిద్దరు ఈరోజు కౌంటర్ దాఖలు చేసింది. అయితే, ఈ కౌంటర్ పై విచారణను న్యాయస్థానం ఈ నెల 19కి వాయిదా వేసింది.

Exit mobile version