Site icon TeluguMirchi.com

మంత్రి ధర్మానకు ఊరట

Dharmana-Prasada-Raoక్విడ్ ప్రో కో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఛార్జ్షీట్ పరిగణనలోకి తీసుకోవటాన్ని న్యాయస్థానం తప్పు పట్టింది. మంత్రి విచారణకు ప్రాసిక్యూషన్కు అనుమతి అవసరం లేదన్న సీబీఐ వాదనల్ని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇటీవలే సీబీఐ కోర్టు.. జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మానను విచారించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తీర్పు ఇచ్చింది. దీంతో, ధర్మాన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Exit mobile version