సీబీఐ ప్రశ్నలకు వివరణ ఇచ్చా: ధర్మాన

dharmanaలేపాక్షి భూముల కేటాయింపు వ్యవహారంలో సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగింటి వరకు మొత్తం ఐదు గంటల పాటు దిల్ కుషా అతిధి గృహంలో సీబీఐ అధికారుల ధర్మాన తో విచారణ జరిపిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం బయటికి వచ్చిన ధర్మాన మీడియాతో మాట్లాడారు. లేపాక్షి వ్యవహారంలో ఐఏఎస్ అధికారి శామ్యూల్ ను కూడా సీబీఐ పిలిచిందని ధర్మాన వెల్లడించారు. మరల తనను విచారణకు పిలిచే ఆలోచన లేదని సీబీఐ చెప్పినట్లు తెలిపారు.