సభను సాగనివ్వం : దేవినేని

Devineniసీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు టీ-బిల్లుపై శాసనసభలో చర్చ జరగనీయమని తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమ స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద ఉమ విలేకరులతోమాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా జరుగుతున్న విభజన ప్రక్రియను ప్రజలు తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, వైకాపా ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర తీర్మాణం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.