ప్రజాస్వామ్యంపై, ఇక్కడి ప్రభుత్వ విధివిధానాలపై పవన్ కల్యాణ్ తనకున్న నిర్ధిష్ట అభిప్రాయాలను తెలుపుతూ ఓ పుస్తకం రాశాడు. అదే ’ఇజం’. ఈ పుస్తకాన్ని పవన్ కల్యాణ్… జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలో విడుదల చేద్దామనుకొన్నాడు. కానీ కుదర్లేదు. ఇప్పుడు ఈ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్సయ్యింది. ఈనెల 25నగానీ, 26న గానీ ’ఇజం’ పుస్తకాన్ని విడుదల చేస్తాడట. ఆ కార్యక్రమంలో వవన్ కల్యాణ్ పాల్గొననున్నాడు. పవన్ సన్నిహితుడు, ఈపుస్తకానికి మరో రచయిత రాజా రవితేజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు. పవన్ కల్యాణ్ అసలు సిసలైన ఆలోచనల్ని, జనసేన విధివిధానాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పవన్ పార్టీపై రాజకీయ నాయకులలో చాలా సందేహాలున్నాయి. వాటన్నింటికీ ఈ పుస్తకం ఓ సమాధానం కావచ్చు. ఈ పుస్తకాన్ని రాష్ట్రంలోని ప్రతి అభిమానికీ చేరువ చేయాలని పవన్ సంకల్పించాడు. మరి ఈపుస్తకాన్ని ఉచితంగా అందిస్తాడా? లేదంటే అందుబాటు ధర పెడతాడా?? అన్నది కూడా ఆసక్తికరమే.