Site icon TeluguMirchi.com

మంత్రి మౌన దీక్ష..!

Danam-Nagenderసీమాంధ్రలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని దానం నాగేందర్ ఖండించారు. విగ్రహాలు ధ్వంసం చేయడంపై మనస్తాపం చెందిన దానం నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విగ్రహాల విధ్వాసానికి వ్యతిరేకంగా.. దానం కొద్దిసేపు మౌనదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరా, రాజీవ్ విగ్రహాలు ధ్వంసం చేయడం మంచి పరిణామం కాదని దానం అన్నారు. అంతేకాకుండా.. సీమాంధ్ర ఉద్యోగాలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దానం మండిపడ్డారు. హైదరాబాద్ ను విడిచి వెళ్లాల్సింది విజయ నగరం నుండి వలసవచ్చిన కేసీఆరే నని దానం ఎద్దేవా చేశారు.

Exit mobile version