Site icon TeluguMirchi.com

సీఎంపై డిప్యూటీ ఆగ్రహం !

Presentation1ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. సీఎం కిరణ్ వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. ఈరోజు దామోదర నల్గొండ జిల్లాలోని యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక ప్రాంతం ప్రజలే ప్రజలా.. తెలంగాణ వారు ప్రజలు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి గానీ… వారి మనోభావాలు అవసరం లేదా అని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్, తెరాసతో పొత్తుపెట్టుకున్నప్పడు సమైక్యాంధ్ర గుర్తుకు రాలేదా..? అని ఆయన సీమాంధ్ర నేతలను సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని దామోదర స్పష్టం చేశారు.

Exit mobile version