సోనియాతో భేటీయైన డీఎస్ !

D. srinivasకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను డీఎస్, అధినేత్రికి వివరించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర నేతల రాజీనామాల విషయం, జాతీయ నేతల విగ్రహ్రాల ధ్వంసం గురించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా అధిష్టానం విభజనపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఛీప్ బొత్స లు ఎలా వ్యవహరిస్తున్నరన్న దానిపై కూడా సోనియా ఆరా తీసినట్లు సమాచారం.