అధినేత్రిని ఆయనే ఒప్పించాడంట !

Sonia_Gandhiఅధిష్టానం తెలంగాణ ఇవ్వడంలో న్యాయముందని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీకి ఏమీ తెలియదని అందరూ భావిస్తుంటారని, కానీ ఆమెకు అపారమైన విషయ పరిజ్ఞానం ఉందని శ్రీనివాస్ అన్నారు. దేశం నలుమూలల ఏమి జరుగుతున్న దానిపై అదినేత్రికి స్పష్టమైన అవగాహన ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు ఏకపక్ష నిర్ణయం అనడం సరికాదని, అందరి అబిప్రాయాలు చెప్పాలని పలుమార్లు కోరారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు గురించి సోనియాతో ఐదుసార్లు సమావేశమై ఒప్పించానని ఆయన చెప్పారు. ఒక దశలో తెలంగాణ వెనక్కి వెళ్లిందని.. అప్పుడు అధినేత్రి సోనియాతో సమవేశమై ఒప్పించానని శ్రీనివాస్ అన్నారు. సీమాంధ్ర పజలు విభజనకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు.