Site icon TeluguMirchi.com

ఇంకెవ్వరూ.. బలిదానాలు చేసుకోవద్దు : డీఎస్

D. srinivasసున్నితమైన తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో డీఎస్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఇంకెవ్వరూ.. ప్రాణత్యాగాలు చేసుకోవద్దని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన చిన్న తప్పువల్ల రాష్ట్రంలో గందరగోళం నెలకొందని భవిష్యత్ లో అలాంటి పొరపాటు జరగకుండా అధిష్టానం వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇరు ప్రాంతాల నేతలు ప్రజల మధ్య రాగద్వేషాలు పెంచే వ్యాఖ్యలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా సెటిలర్లకు రాజ్యాంగ ప్రకారం హక్కులు ఉంటాయని ఎవరూ బయపడవద్దని డిఎస్ అన్నారు. కాగా, రాష్ట్ర విభజనపై అపోహలకు తావులేదని ఆయన అన్నారు.

Exit mobile version