Site icon TeluguMirchi.com

తెలంగాణ పేజీ వెనక్కు వెళ్లలేదు : డీఎస్

D Srinivasతెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు శ్రీనివాస్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. విభజన జరిగినా.. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకోవచ్చని అన్నారు. అయితే, ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రమే కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నప్పటికినీ.. పది సంవత్సరాలు హైదరాబాద్ ఎలాగూ.. ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశంలోని ప్రదాన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటని.. ఇక్కడ ఎవరైనా వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోవచ్చని డీఎస్ చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ వాదులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తెలంగాణ పేజీ వెనక్కు వెళ్లలేదని డీఎస్ అన్నారు.

Exit mobile version