ఎవరైనా..ఎక్కడైనా.. ఓకే!

D.-srinivasసమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 7న జరుగనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతి లభిస్తుందని ఎపీఎన్జీవోలు తెలిపారు. హైదరాబాద్ లో ఎపీఎన్జీవోల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సభకు అనుమతిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే కోర్టుకు వెళ్తామని హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ తెలిపారు.

ఇది ఇలా వుండగా ఏపీఎన్జీవోలను ఉద్దేశించి పిీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా, ఎక్కడైనా సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని, విభజనకు సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణపై నిర్ణయం ఇక్కడి ప్రజాభీష్టం మేరకే జరిగిందన్నారు.