Site icon TeluguMirchi.com

గులాభిపై హస్తం ఫైర్ !

congress-fire-on-trsకేసీఆర్ ప్రభుత్వంపై హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు. మండలి ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని గవర్నర్‌ ను కోరతామని కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ అన్నారు. అయితే, ఇటీవలే కొంత మంది హస్తం ఎమ్మెల్సీలు గులాభి పార్టీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వారిపై వేటు పడక ముందే మండలి సమావేశాలు నిర్వహించి చైర్మెన్ పదవిని కొట్టేయ్యాలన్నది గులాభి పార్టీ ప్లాన్. మరోవైపు, తెరాస వ్యూహాలకు గండికొట్టాలని హస్తం సీనియర్ నేతలు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. గవర్నర్ ను కలసి పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్సీలపై వేటు వేయాలని కోరారు. మరీ.. వ్యూహా-ప్రత్యివ్యూహాలలో మండలి చైర్మెన్ పదవి ఎవరిని వరించనుందో.. తెలియాలంటే.. మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Exit mobile version