‘రిలయన్స్’ పై కామ్రెడ్స్ కన్నెర్ర !

narayanaఎల్లప్పుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే వామపక్షాలు ఈ సారి రిలయన్స్ సంస్థను టార్గెట్ చేశాయి. రిలయన్స్ గ్యాస్ దోపిడీకి వ్యతిరేకంగాకాకినాడ కలక్టరేట్ వద్ద సీపీఐ ఈరోజు (సోమవారం) ఉదయం మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. రిలయన్స్‌ సంస్థకు ప్రధాని, సోనియా సహకరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం రిలయన్స్ కు బానిసగా మారిందని ఆయన విమర్శించారు. దేశ సహజ సంపద దోపిడీకి రిలయన్స్ యత్నిస్తోందని.. దీనిపై సీపీఐ పోరాడుతుందని నారాయణ స్పష్టం చేశారు. అయితే, ప్రజా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన వారి విషయంలో నిబంధనలు సడలించాలని, హత్య, అత్యాచారం, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.