Site icon TeluguMirchi.com

పొడుస్తున్న కొత్త పొత్తులు!!

ponnalaఎన్నికల వేళ కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో సరికొత్త పొత్తులకు తెరలేస్తోంది. తాజాగా, సీపీఐ కార్యదర్శి నారాయణతో తెలంగాణ పీసీసీ ఛీప్ పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. ఎన్నికల పొత్తుపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా 3ఎంపీ స్థానాలను 22 శాసన సభ స్థానాలను కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సీపీఐ తో పొత్తుకు తెరాస ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలు నేతలు కేటీఆర్, కేశవరావు సీపీఐ తో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. కాగా, 2004లో కాంగ్రెస్ తో జతకట్టిన కామ్రెడ్స్ 2009లో తెదేపాతో కలసి మహాకూటమిలో చేరారు.

Exit mobile version