సచివాలయాన్ని స్మశానవాటికగా మార్చిన కాంగ్రెస్

CPI-Narayanaకాంగ్రెస్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. సచివాలయాన్ని స్మశానవాటికగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేయకుండా అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో ఘర్షణ వాతావరణం నెలకొల్పిందని అన్నారు. ఏపీఎన్జీవోల సభ ప్రశాంతంగా ముగియడం శుభసూచికమని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు మిలినీయం మార్చ్ నిర్వహిస్తామనడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు