Site icon TeluguMirchi.com

రాజకీయం కోసమే రచ్చబండ!

cpi-narayanaరచ్చబండను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయం కోసమే ఉపయోగించుకోవడం సరికాదని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఈరోజు నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తీర్చేందుకు ఉపయోగించే రచ్చబండ ద్వారా.. సీఎం రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకోవడం సిగ్గుచేటని అన్నారు. సీమాంధ్ర ఎంపీలకు వ్యాపారాలే ముఖ్యమని ఆయన ఆరోపించారు. విభజన విషయంలో ప్రధానమైన అంశాలను ప్రక్కకు పెట్టేందుకే.. కేంద్రం రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని నారాయణ విమర్శించారు.

రచ్చబండ కార్యక్రమం ద్వారా.. ముఖ్యమంత్రి ఇస్తున్న సమైక్య ప్రసంగాలపై తెలంగాణ నేతలు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లలో కూడా ముఖ్యమంత్రి ఫొటోను తీసివేస్తే పరిస్థితి ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే కిరణ్ తెలంగాణ జిల్లాల్లో జరిగే ఏ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడం లేదు.

ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాల్లో చేస్తున్న ప్రసంగానికి తెలంగాణ నేతలే కాకుండా, సీమాంధ్ర నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ఉపయోగపడే విధంగా కాకుండా ముఖ్యమంత్రి సొంత పంథాలో వెళ్లడాన్ని పట్ల పలువురు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రచ్చబండ తాజాగా సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Exit mobile version