19న సీపీఐ సామూహిక ధర్నా

cpi narayanaసీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 19న ఇందిరాపార్కు వద్ద తెలంగాణకు మద్దతుగా సామూహిక ధర్నా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. కేంద్రం తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశరు. సామూహిక ధర్నాకు సంబంధించిన పోస్టర్ ను ఈరోజు (ఆదివారం) ఆయన ఆవిష్కరించారు. బీజేపీ, వైకాపా మినహా తెలంగాణ అనుకూలంగా ఉన్న పార్టీలన్నింటినీ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరతామని నారాయణ తెలిపారు. తెలంగాణపై కేంద్రం అనుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానానికి రహస్య లేఖ పంపినట్లు.. ఒకవేళ తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే తాము రాజీనామాలకు సైతం వెనకాడబోమని పేర్కొన్నట్టు సమాచారం.