Site icon TeluguMirchi.com

తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం : షిండే

Shindeతెలంగాణపై ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారన్నారని కేంద్ర హోమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. అఖిలపక్షంలో అన్ని రాజకీయ పార్టీ నేతల అభిప్రాయాన్ని విన్నామని, తాము చెప్పాల్సింది చెబుతామన్నారు. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని సమావేశ అనంతరం చెప్పామని గుర్తు చేశారు. ఈనెల 28 వరకు గడువుందన్నారు. ముందు చెప్పినట్టుగా కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గత నెల 28న కేంద్ర హోమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అంశంపై చర్చించలేదని షిండే తెలిపారు.

Exit mobile version