ఏపీ బీజేపీ నేతలకు కార్పోరేషన్ పదవులు…!

ఏపీ బీజేపీ నేతలకు పదవుల పందేరం చేస్తుంది కమలం పార్టీ. గుంటూరు జిల్లాకి చెందిన బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాధబాబును పోగాకు బోర్డు చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీ బీజేపీ అధికారప్రతినిధి అయిన రఘునాథ్ బాబు ఈ పదవిలో మూడేళ్ళ పాటు కొనసాగుతారు. గుంటూరులోనే ఈ టొబాకో బోర్డు కార్యాలయం కూడా ఉంది.

ఇప్పటికే ఏపీలోని బీజెపి నేతలు కొందరు కేంద్రంలో పదవులు పొందగలిగారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఎయిర్ ఇండియా డైరెక్టర్ గా పదవి లో నియమితులు కాగా, విష్ణువర్దన్ రెడ్డిని నెహ్రూ యువక కేంద్ర ఉపాద్యక్షుడిగా నియమితులయ్యారు. తాజాగా యడ్లపాటి రఘునాద బాబు టొబాకో బోర్డు చైర్మన్ పదవి పొందారు. ఈయన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సన్నిహితుడుగా గుర్తింపు పొందారు.