టిక్ టిక్.. ‘టీ’ పై కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రారంభం !

core committee meeting on telangana startedతెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రధాని మన్మోహన్ నివాసంలో కాసేపట్లో భేటీ కానుంది. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరుకావడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్, గులాంనబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర.. తదితరులు ప్రధాని నివాసానికి చేరుకున్నారు. కాగా, కోర్ కమిటీలో సభ్యుడు కానప్పటికీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ ఈ కీలక భేటీకిహాజరవనున్నట్టు సమాచారం.