ముగిసిన త్రిమూర్తుల ప్రజెంటేషన్ !

cm-kiran-damodar-narasima-bతెలంగాణపై సమావేశమయిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు గంటన్నర పాటు సాగినా.. సమావేశంలో డిప్యూటీ సీఎం, సీఎం, పీసీసీ ఛీఫ్ ల రోడ్ మ్యాప్ ప్రజెంటేషన్ ముగిసినట్లు తెలుస్తోంది. మెదటగా డిప్యూటీ సీఎం తన రోడ్ మ్యాప్ ప్రజెంటేషన్ ను కమిటీ ముందించారు. ఆ తరావాత ముఖ్యమంత్రి కిరణ్, చివరగా పీసీసీ ఛీఫ్ బొత్స రోడ్ మ్యాప్ ప్రజెంటేషన్లను కమిటీకి వివరించినట్లు సమాచారం. ఇప్పటి వరకు సాగిన సమావేశంలో..త్రిమూర్తల ప్రజేంటేషన్ వినడానికే సరిపోయినట్లు తెలుస్తోంది. నేతల ప్రజేంటేషన్ ముగియడంతో.. కమిటీ సభ్యులు అందులో గల కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధాని నివాసంలో ఆయన అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటుగా ముఖ్యనేతలందరు పాల్గొన్న విషయం తెలిసిందే.