ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కోసం అధిష్టానం ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి చిరంజీవి, ఉపముఖ్యమంత్రి దామోదర, మంత్రులు జానారెడ్డి, కన్నాలు సీఎం రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ఏపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరీ.. వీరిలో నాలుగో కృష్ణుడు ఎవరో తెలియాలంటే.. మరో రెండు రోజులు ఓపిక పట్టాల్లిందే.