ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు.. !!

81393358273_625x300ఆంధ్రప్రదేశ్ కు నాలుగో కృష్ణుడు రానున్నాడు. కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గుచూపుతోంది. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఏర్పాటైతేనే మేలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వ ఏర్పాటుకు రెండుమూడురోజులుగా సీమాంధ్ర, తెలంగాణ నేతలతో సాగిస్తున్న మంతనాలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మెజారీటి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కోసం అధిష్టానం ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి చిరంజీవి, ఉపముఖ్యమంత్రి దామోదర, మంత్రులు జానారెడ్డి, కన్నాలు సీఎం రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ఏపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరీ.. వీరిలో నాలుగో కృష్ణుడు ఎవరో తెలియాలంటే.. మరో రెండు రోజులు ఓపిక పట్టాల్లిందే.