Site icon TeluguMirchi.com

కాంగ్రెస్ నిర్ణయం మార్చుకోదు: దిగ్విజయ్

Digvijay_Singhతెలంగాణ ఏర్పాటు విషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ సెక్రెటరీ జనరల్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రాంతీయ పార్టీల మాదిరి… ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ వెనకడుగు వేయబోదని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీల మాదిరి తాము యూటర్న్ తీసుకోలేమని తెలిపారు. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన ఇంకా జరగలేదని… ఇప్పటివరకైతే అందరినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ అన్నారు. ఇక రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్నిధిక్కరిస్తూ సీఎం కిరణ్ మాటలపై స్పందిస్తూ.. కిరణ్ ఏం మాట్లాడారో రికార్డులు చూసి తెలుసుకున్న తర్వాతే మాట్లాడతానని అన్నారు.

Exit mobile version