తెదేపా ఎంపీలకు పరామర్శ

chiru kvpపార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న సీమాంధ్ర టీడీపీ ఎంపీలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా, దీక్ష చేస్తున్న తెదేపా ఎంపీలను కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు పరామర్శించారు. కేంద్ర మంత్రి చిరంజీవి,కాంగ్రెస్ ఎమ్.పిలు కెవిపి రామచంద్రరావు,లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు తెదేపా ఎంపీలను పరామర్శించిన వారిలో ఉన్నారు. కాగా, ఉభయ సభల నుండి సస్పెండ్ అయిన తెదేపా ఎంపీలు పట్టువదలకుండా పార్లమెంట్ ఆవరణలో దీక్షకు దిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఎంపీల దీక్షను భగ్నం చేసేందుకు ప్రభుత్వం రెడీగా వున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఎండ ఎక్కువగా వున్న కారణంగా ఎంపీలు సొమ్మసిల్లే ప్రమాదం వుండటంతో పోలీసులు అంబుల్సెను సైతం రెడీగా వుంచినట్లు సమాచారం.