తెలుగుజాతిని అవమానిస్తున్నారు : బాబు

cbnవిభజన విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై మరోసారి మండి పడ్డారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. ఈరోజు (బుధవారం) ఉదయం తన నివాసంలో బాబు విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనను కేంద్రం అపహాస్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తెలుగుజాతిని అడుగడుగున అనుమానిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపక్ష ధోరణితో నిర్ణయం తీసుకోవడం తద్వారా.. పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో… వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియకే కేంద్రం అన్ని పార్టీలకు లేఖలు రాసిందని ఆయన అన్నారు. ఆడించేది కాంగ్రెస్ పార్టీ అయితే.. ఆడేది వైకాపా తెరాసలని బాబు ఘూటుగా విమర్శించారు. ఒక్కొక్క పార్టీకి కేవలం 20నిమిషాలు మాత్రమే కేటాయించి రాష్ట్రాన్ని విభజిస్తారా.. ? అని బాబు ప్రశ్నించారు. కాగా, సమన్యాయం చేయమని మొదటి నుంచి తెదేపా కోరుతుందని బాబు స్పష్టం చేశారు.