Site icon TeluguMirchi.com

కాంగ్రెస్, దేశం ఒకటే…. కడియం

kadiyam-srihari-శాసనసభలో వై ఎస్ ఆర్ సి పి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినపుడు మద్దత్తివ్వని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కళంకిత మంత్రులను రాజీనామాలు చేయమనటం విచిత్రంగా వుందని ఇటివలనే తెలుగుదేశం పార్టీ నుంచి టి ఆర్ ఎస్ లోకి జంప్ అయిన కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే చంద్రబాబు ఆదివారం నాడు బయలుదేరి డిల్లి వెళ్ళారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు తెలుగుదేశం మద్దతిస్తోందని, మెల్ల మెల్లగా కాంగ్రెస్ వైపు దేశం అడుగులు వేస్తోందని కడియం ఆరోపించారు. తెరముందు కాంగ్రెస్ ను తిడుతూ, తెర వెనుక కాంగ్రెస్ కు మద్దతు ఇస్తూ చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారని కడియం ఎద్దేవా చేసారు.

Exit mobile version