Site icon TeluguMirchi.com

రేపు కడప జిల్లాలో సీఎం జగన్ టూర్…!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు గన్నవరం నుంచి విమానంలో కడప బయల్దేరి వెళ్తారు. 8 గంటల 15 నిమిషాలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 8గంటల 35 నిమిషాలకు ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి వైఎస్‌ఆర్ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత వైస్ఆర్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.

 

అనంతరం రోడ్డు మార్గంలో బయల్దేరి 9గంటల 35 నిమిషాలకు గండి వీరాంజనేయస్వామిని దర్శించుకుంటారు. పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేస్తారు. తిరిగి రోడ్డు మార్గంలో ఇడుపులపాయ చేరుకుంటారు. ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10గంటల 40 నిమిషాలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు చేరుకుంటారు. 10గంటల 50 నిమిషాలకు రైతు దినోత్సవ సభాస్థలికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. అక్కడ స్టాళ్లను పరిశీలించి వైఎస్ఆర్‌ రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఇక్కడే వైఎస్సార్ పెన్షన్‌ కానుక కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లికి పయనమవుతారు.

Exit mobile version