Site icon TeluguMirchi.com

అన్ని శాఖల అధికారులతో సీఎం సమీక్ష

cm kiranరాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అన్ని శాఖల అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని కోరుతూ.. ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె, వ్యాపార సంస్థల బంద్ కారణంగా నిత్యావసర వస్తువుల రవాణాకు ఆటంకాలను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. సీమాంధ్ర జిల్లాల నుంచి.. జంట నగరాల మార్కెట్లకు వచ్చే సరుకుల పరిస్థితిని గమనించి, సమస్యలేవైనా తలెత్తితే వెంటనే అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Exit mobile version