చర్చలకు సీఎం సిద్ధం !

cm kiran.jpjఏపీ ఎన్జీవోలతో చర్చించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడీ అయ్యారు. ఎల్లుండి (బుధవారం) మధ్యాహ్నం 12.30నిమిషాలకు ఉద్యోగులతో సీఎం సమావేశం కానున్నారు. ఇంతకాలం సమ్మెను విరమింపజేసేందుకు సీఎం పెద్దగా ఆసక్తి చూపలేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, ముఖ్యమంత్రే సమ్మెకు నాయకత్వం వహిస్తున్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. సమ్మెల వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లుకు గురి అవుతున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని గట్టిగానే ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. ఎట్టకేలకు కిరణ్ ఉద్యోగులతో చర్చించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈరోజు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన చర్చలను ఏపీ ఎన్జీవోలు బహిష్కరించారు. మంత్రివర్గ ఉపసంఘం స్థాయిలో పరిష్కారమయ్యే సమస్య కాదని.. ముఖ్యమంత్రి స్థాయిలో అయితే ఆలోచిస్తామని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.