ఆజాద్ తో సీఎం భేటీ !

kiran-azadముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ టూర్ లో భాగంగా ఈరోజు (గురువారం) ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ గులాం నబీ ఆజాద్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఉదయం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా హస్తిన చేరుకున్నారు. అధిష్టానం పెద్దలతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది.