వృక్షాలను ప్రేమించండి

CM-Kiranవృక్షాలను ప్రేమించాలని ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం, కండ్లయలో ఈరోజు (సోమవారం) జరిగిన 64వ వనమహోత్సవంలో సీఎం కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పర్యావరణంపై అందరికీ అవగాహన పెంచాలని, అడవులను నాశనం చే సేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అడవులును 33 శాతం పెంచాల్సిన బాధ్యత మనందరిపైన వుందని సీఎం గుర్తుచేశారు. అడవులను, అడవి జంతువులను చంపే వారిని కఠినంగా శిక్షించాలని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శత్రుచర్ల, సబితా ఇంద్రారెడ్డి.. తదితరులు పాల్గొన్నారు.