శ్రీధర్ బాబుకు కిరణ్ షాక్…!!

kiranమంత్రి శ్రీధర్ బాబుకు.. సీఎం కిరణ్ షాక్ ఇచ్చారు. శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి శ్రీధర్ బాబును తప్పించారు. ఈ శాఖ బాధ్యతలను మరో మంత్రి శైలాజనాథ్ కు అప్పగించారు. టీ-బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో..  కిరణ్ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. మరోవైపు, కిరణ్ వైఖరిపై టీ-నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. శీధర్ బాబు శాఖ మార్పునకు నిరసనగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు ఆయన మద్దతు దారులు.