ఢిల్లీ వెళ్లిన సీఎం !

CM-kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోమారు హస్తిన బాటపట్టారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నతర్వాత ముఖ్యమంత్ర్రి ఢిల్లీకి వెళ్లడం ఇదే మొదటిసారి. అధిష్టానం ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సీఎం అధిష్టాన పెద్దలకు వివరించనున్నారు. అంతకుముందు, ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజీగూడలో రాజీవ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.