దీక్షలో పాల్గొనడానికి పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు సి. రామచంద్రయ్య, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రాంనాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, డొక్కా.. తదితరులు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి సీమాంధ్ర నేతలు రెడీ కావడంతో.. ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం వుంది. మరోవైపు, టీ-నేతలు సైతం హస్తినా చేరి ’టీ’కి మద్దతుగా వారి వారి ప్రయత్నాలు సాగించడానికి రెడీ అయిపోయారు. దీంతో.. హస్తినా ఏపీ పాలిటిక్స్ తో మరోసారి హీటెక్కనుంది.