తాజాగా, ఈ ఘోరమైన వ్యవహారం (రాష్ట్ర విభజన) నా చేతుల మీదుగా నడిపించేందుకు సిద్ధంగా లేను. నా శక్తిమేరకు ఎదుర్కొంటాను. ఈ దశలో నా పదవి పోయినా ఫర్వాలేదు” అని కిరణ్ తేల్చిచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తనను కలిసినప్పుడు సమావేశ ముగింపు దశలో ఒక సీనియర్ నేతతో ఇదే విషయం పునరుద్ఘాటించినట్లు సమాచారం.
తెలంగాణపై తీర్మాణం అసెంబ్లీలో వీగపోయే అవకాశం ఉన్నట్లు సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో తీర్మాణం వీగిపోయినట్లయితే.. విభజన మరింత ఆలస్యం కావచ్చని.. వీలైతే మరోసారి ఫామ్ లోకి వచ్చైనా.. రాష్ట్ర విభజనను అడ్డుకోవలని సీఎం కిరణ్ భావిస్తున్నట్లు సమాచారం.